ప్రాతూరి శాస్త్రి - 20.10.2020. ....           20-Oct-2020

 1357 వ రోజు సుందర చల్లపల్లి 30.07.2018

            నాదెళ్ల సురేష్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి జండా పట్టుకొని 41.5 కి మీ. మారథాన్ లో పాల్గొన్నది విదితమే. వారికి మద్దతుగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు, రథసారధులు, బాల కార్యకర్తలు, పోలీస్ వారు, పంచాయతీ అధికారులు సంత బజారు నుండి బస్టాండ్ వరకు "పరుగు" ను నిర్వహించగా యం ఆర్ ఓ గారు జండా వూపి ప్రారంభించారు.

            30.07.2018 నుండి సురేష్ గారికి మద్దత్తుగా స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలందరూ ఆగస్టు 2018 నెలలో ప్రతిరోజూ వేకువ సేవానంతరం 1 కి.మీ స్వచ్ఛతా పరుగు నిర్వహించదలచారు.

            దాదాపుగా నెలరోజులపాటు పూర్తిగా స్వచ్ఛతా పరుగు నిర్వహించారు.

            జై స్వచ్ఛ సుందర చల్లపల్లి  జై జై స్వచ్ఛ సుందర చల్లపల్లి...

- ప్రాతూరి శాస్త్రి

20.10.2020.