కార్యకర్తలకు , గ్రామ ప్రజలకు మనవి
బైపాస్ రోడ్డులో భారత లక్ష్మీ రైస్ మిల్ గోడను వారి అనుమతితో స్వచ్చ కార్యకర్తలు రంగులు వేసి సుందరీకరించారు. అక్కడ చెత్త వేయడం, గోడకు పోస్టర్లు అంటించడం చేయరాదని పంచాయితీ సెక్రటరీ వారు పెట్టిన బోర్డు కూడా ఉన్నది. ఇప్పుడు ఆ గోడ ఒక వైపు నల్లగా మసిబారిపోయి ఉంది. ప్రక్కనే ఉన్న గోనెసంచుల వారు పాత గోనెసంచులను అక్కడ తగలబెట్టినట్లు తెలిసింది. వారికి కౌన్సలింగ్ ఇవ్వడం జరిగింది.
గ్రామ సుందరీకరణ లో భాగంగా గతంలో కూడా చాలా కల్వర్టులకు రంగులు వేయించి, నినాదాలు రాయించడం జరిగింది. గంగులవారిపాలెం రోడ్డు వద్ద 6 వ నెంబరు కాల్వ పై ఉన్న కల్వర్టు, విజయవాడ రోడ్డులో 6 వ నెంబరు కాల్వ వద్ద ఉన్న కల్వర్టు, విజయవాడ రోడ్డులో నారాయణరావు నగర్ రోడ్డు వైపు ఉన్న కల్వర్టు, పాగోలు రోడ్డులో ఉన్న కల్వర్టు లపై పోస్టర్లు అంటించి అందవికారంగా ఉన్నాయి.
స్వచ్చ కార్యకర్తలు సుందరీకరించిన ప్రదేశాలలో పోస్టర్లు అంటించడం గాని, నోటీసులు రాయడం గాని జరుగుతూ ఉంటే వారికి దయచేసి కౌన్సలింగ్ ఇచ్చి నచ్చజెప్పవలసిందిగా గ్రామస్తులకు విజ్ఞప్తి. అలాగే రహదారి వనములకు బోర్డులు కట్టడం గాని, వాటి ముందు ఫ్లెక్సీ పెట్టడం గాని చేస్తుంటే వారికి కూడా నచ్చజెప్పగలరు.
దాసరి రామకృష్ణ ప్రసాదు
23.06.2019
6 వ నెంబరు కాలువ వద్ద ఉన్న కల్వర్టు
Powered by Facebook Like
Leave a Reply