ముఖ్యమంత్రి గారికి 5 సూచనలు
మొన్న (06-06-2017) సాయంత్రం ‘నవనిర్మాణ దీక్ష’ సభలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి – డబ్బుతో సంబంధం లేకుండా కేవలం అధికారం ఉపయోగించి 5 పనులు చేస్తే ‘స్వచ్ఛాంధ్ర ప్రదేశ్’ ని సాధించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పడం జరిగింది.
- రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలి.
(ప్రతి ఇంటి నుండి, వ్యాపార సంస్థ నుండి, కార్యాలయం నుండి ప్రతి రోజూ గాని, రెండు రోజులకు ఒకసారి గాని చెత్తను సేకరించే విధానం మొదలుపెట్టిన తరువాత ఈ పనిని చేయాలి.)
- 50 మైక్రాన్ల క్యారీ బ్యాగులను కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ ప్రతి చోటా వాడుతూనే ఉన్నారు. అధికారులు తమకున్న అధికారాన్ని ఉపయోగించి ఈ నిషేధాన్ని అమలు చేయాలి.
100 మైక్రాన్ల క్యారీ బ్యాగులను, ప్లాస్టిక్ గ్లాసులను మన రాష్ట్రం నిషేధించి అమలు చేయాలి.
- ఒకరోజు వాడి పారేసే ఫ్లెక్సీల వాడకాన్ని బ్యాన్ చేసి గట్టిగా అమలు చేయాలి.
ముందుగా ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిలో ఫ్లెక్సీల వాడకం మానేయాలి.
- రోడ్డు మార్జిన్ నుండి డ్రెయిన్ అంచు వరకు గల స్థలంలో ఆక్రమణలను తొలగింఛి ఖాళీగా అట్టిపెట్టాలి.
- డ్రెయిన్ లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.
-డా.దాసరి రామకృష్ణ ప్రసాదు
Powered by Facebook Like
Leave a Reply