స్వచ్చ సుందర చల్లపల్లి – 10-06-2017
942* నాళ్ళ నిరంతర స్వచ్చ సేవ
స్వచ్చ సుందర చల్లపల్లి సాధనలో భాగంగా ఈరోజు ఉదయం 4-20 గంటల నుండి 6-00 వరకు 42 మంది స్వచ్చ కార్యకర్తలు సంపటాలమ్మ గుడి వద్ద నుండి రాజ్యలక్ష్మి గారి బజారు వరకు డ్రెయిన్ ను శుభ్రం చేసారు.
ఈరోజు డ్రెయిన్ ను శుభ్రం చేసిన కార్యకర్తలందరూ మిక్కిలి అభినందనీయులు.
ముమ్మనేని నాని గారి కుమారుడు ముమ్మనేని రఘు వంశీ ‘మనకోసం మనం’ ట్రస్ట్ కి 500/- రూపాయలను విరాళంగా అందించారు. వారికి ధన్యవాదములు.
సర్పంచ్ కట్టా పద్మావతి గారు ‘నవనిర్మాణ దీక్ష’లో తాను మాట్లాడిన విశేషాలను కార్యకర్తలకు వివరించారు.
“కట్టా పద్మావతి” గారు చెప్పిన ‘జై స్వచ్చ సుందర చల్లపల్లి’, ‘స్వచ్చ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసింది.
సంత బజారు లోని డ్రెయిన్ ను పంచాయతీ వారు శుభ్రం చేస్తున్నారు.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు చల్లపల్లి ATM సెంటర్ లో కలుసుకుందాం.
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
శనివారము – 10.06.2017
‘శ్రమమూల మిదం జగత్’
స్వచ్చ భటుల నిత్య శ్రమ సాధనమిది సోదరా!
చల్లపల్లి సమస్తాంధ్ర జాగృతి పాఠమ్మురా!
‘శ్రమమూల మిదం జగత్’ సరికొత్త నినాదం
వర్తమాన, భావిప్రజల స్వస్థతకు శుభప్రదం!
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
Powered by Facebook Like
Leave a Reply