స్వచ్ఛ సుందర చల్లపల్లి – 01/05/2019 (1632* వ రోజు)
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1632* వ రోజు
ఉదయం 4:12 నిముషాల నుండి 6.15 నిముషాల వరకు 32 మంది కార్యకర్తలు మేకల డొంక వద్ద నుండి పెదకళ్లేపల్లి కి వెళ్లే రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు.
కార్యకర్తలు ఎంతో శ్రమ పడి గతంలో పెట్టి పోషించిన పదహారు మొక్కలు ఎవరో పెట్టిన మంట వలన మాడిపోయాయి (?Tax Payers). వాటిని బ్రతికించుకోవటానికి చేసే ప్రయత్నంలో నీళ్లు పట్టటానికి వీలుగా పాదులు చేశారు.
స్వచ్చ కార్యకర్త ‘బాల దుర్గారామ ప్రసాద్ గారు’, బాల కార్యకర్తలు ‘ఆరవ్, ఆర్య’ లు చెప్పిన నినాదాలతో ఈనాటి కార్యక్రమం ముగిసింది.
ఈరోజు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వారు కూడా పాల్గొన్నారు.
పల్నాటి మల్లికార్జునరావు గారి తల్లి సంపూర్ణమ్మ గారి 12 వ వర్ధంతి సందర్భంగా స్వచ్చ కార్యకర్త పల్నాటి అన్నపూర్ణమ్మ గారు స్వచ్చ కార్యక్రమం కోసం 1000/-రూపాయలను ‘మనకోసం మనం’ ట్రస్టుకు విరాళం అందించారు. కార్యకర్తలందరి తరపున వీరికి ధన్యవాదములు.
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 591వ రోజుకు చేరుకున్నాయి.
రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు మేకల డొంక వద్ద కలుసుకుందాం.
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్టు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
బుధవారం – 01/05/2019.
*ఈ స్వచ్చ సైనికులు….*
స్వచ్చ శుభ్ర చల్లపల్లి సాధనలో ఆటంకా
లెన్నైనా- అన్నిటినీ ఎదుర్కొని గెలిచినారు
గత నాల్గైదేళ్ల దీర్ఘ కాలంలో తమకందిన
ఏ చిన్నవకాశాన్నీ వీళ్లు వదలి పెట్టలేదు!
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి.
4.12 కు మేకల డొంక వద్ద కొబ్బరి మొక్కను నాటుతున్న నరసింహా రావు గారు, BDR గారు మాడిపోయిన మొక్కలుస్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు
Powered by Facebook Like
Leave a Reply