నిరంతర గ్రామసేవ @ 1272* రోజులు
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 44 మంది కార్యకర్తలు ఉదయం 4-10 గంటల నుండి 6-00 గంటల వరకు కోమలానగర్ లోను, విజయవాడ రోడ్డులో విజయా కాన్వెంట్ నుండి NTR పార్క్ వరకు పిచ్చిమొక్కలు నరికి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు.
ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో ఉన్న డ్రెయినేజి మట్టిని తీసి కమలాల్లో పోశారు.
కొంతమంది కార్యకర్తలు విజయవాడ రోడ్డులో బిళ్ళగన్నేరు మొక్కలు నాటారు.
మరికొంతమంది రామానగరంలోని పద్మావతి ఆసుపత్రి రోడ్డులో ఉన్న కమలంలో బోగన్ విలియా మొక్కని నాటారు.
గోళ్ళ వెంకటరత్నం గారి మనవడు “యువతేజ్” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు మొదలుపెట్టి నేటికి 231 రోజులు.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “చల్లపల్లి సెంటర్ లో” కలుసుకుందాం.
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
Leave a Reply