ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం.
రాత్రి కురిసిన వర్షం వలన ముందుగా అనుకున్నట్లుగా బందరు రోడ్డులో కాకుండా ఈరోజు స్వచ్ఛ కార్యక్రమం నాగాయలంక రోడ్డుకి మార్చటం జరిగింది.
నేటి కార్యక్రమంలో 28 మంది కార్యకర్తలు ఉదయం 4-28 గంటల నుండి 6-00 గంటల వరకు నాగాయలంక రోడ్డులో అమరస్థూపం నుండి కాసానగరం వైపు డ్రెయిన్ గట్లపై ఉన్న ముళ్ళకంపలు తొలగించి శుభ్రం చేశారు.
స్వచ్ఛ కార్యకర్తలు “కస్తూరి విజయ్, మెండు శ్రీనివాస్ గార్లు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
283 రోజులుగా స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “బందరు రోడ్డులో రిజిస్ట్రార్ ఆఫీస్” వద్ద కలుసుకుందాం.
వర్షం వస్తే “నాగాయలంక రోడ్డులో నేటి కార్యక్రమం ముగిసిన చోట” కలుద్దాం.
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
Powered by Facebook Like
Leave a Reply