దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం (02.03.2020)....           02-Mar-2020

 స్వచ్చ చల్లపల్లి కోసం మనకోసం మనం ట్రస్టు కు దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం

 
రామానగరం కు చెందిన దాసరి వేంకట రమణ గారు తమ కుమారుడు “అను దీప్” వివాహం మార్చ్ 5 వ తేదీన జరగబోవు సందర్భంగా స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాల కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు లక్ష రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు.
SRYSP జూనియర్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన రహదారి వనం నిర్మించడం లోనూ, గ్రామంలోని అన్ని రహదారి వనంలను నిర్మించడంలోనూ, బస్ స్టాండ్ ను ఆధునీకరించి తోటలను నిర్మించడం లోనూ, తరిగోపుల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడంలోనూ, NTR పార్క్ లో, నాగాయలంక రోడ్డు లో పబ్లిక్ టాయిలెట్లు కట్టించడంలోనూ, పద్మావతి హాస్పటల్ రోడ్డు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను చేయించి వనాన్ని అభివృద్ధి చేయడంలో వీరి పాత్ర గణనీయమైనది. స్వచ్చ సుందర చల్లపల్లి నేటి స్థితికి కారణమైన ప్రతి కార్యక్రమంలోనూ వీరి సహాయం ఉంది.
 
గతంలో కూడా వీరి కుమారుడు అనుదీప్ (ప్రస్తుత పెళ్లి కొడుకు) 15,000/- లను స్వచ్చ చల్లపల్లికి విరాళమిచ్చారు.
 
వీరిద్దరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
 
దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ – మనకోసం మనం
చల్లపల్లి
02.03.2020.

దాసరి వెంకటరమణ గారు
దాసరి అనుదీప్