విరాళం (10.03.2020)....           10-Mar-2020

  పాగోలు వాస్తవ్యులు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త "కంఠంనేని రామ బ్రహ్మ్మం గారు" నేడు తన 69* వ పుట్టినరోజు సందర్భంగా 'స్వచ్చ చల్లపల్లి' కార్యక్రమాల కోసం 'మనకోసం మనం' ట్రస్టుకి 20,000/- చెక్కును విరాళంగా అందచేశారు. వీరు ప్రతి సంవత్సరం మార్చిలో 15 వేలు, సెప్టెంబర్ లో 15 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన 1,70,000/- రూపాయలతో కలిపి ఇప్పటివరకు వారు 1,90,000/- రూపాయలను ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. 

 
స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున వీరికి జన్మదిన శుభాకాంక్షలు, ధన్యవాదములు.
   
వారి అభ్యర్ధన :
'పాగోలు రోడ్డు లో సిమెంట్ రోడ్డు వరకు రెండు వైపులా మనం పెట్టిన మొక్కలను రక్షించి, కలుపు తీసి మనందరం కలిసి ఆ రోడ్డును సుందరంగా నిర్వహిద్దాం. పాగోలు వాస్తవ్యుడనని నేను అడగడం లేదు. ఆ రోడ్డు కూడా మన స్వచ్చ చల్లపల్లి లో భాగమే అనుకొందాం' అని వారు అభ్యర్ధించారు.   
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
మంగళవారం - 10/03/2020.