చల్లపల్లి ప్రజలకు విజ్ఞప్తి!
- “ఫ్లెక్సీషేమ్” ఉద్యమాన్ని బలపరచండి.
ప్లాస్టిక్ నీళ్ళ సీసా భూమిలో కరగడానికి 400 సం॥ పడుతుంది. ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులేవీ వాడవద్దని అనేక దేశాలు నిషేధించాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే జూన్ నుండి ఈ నిషేధాన్ని అమలు పరచబోతోంది.
ఒక చిన్న ప్లాస్టిక్ సీసా భూమికి ఎంత భారమో తెలిసిన తర్వాత ఈ వేలాది - లక్షలాది ఫ్లెక్సీ బ్యానర్లు పర్యావరణానికి ఎంత ప్రమాదమో చెప్పనలవి కాదు.
అందుకే స్వీడన్ బాలిక ‘గ్రేటా ధన్ బర్గ్’ మొదలుపెట్టిన “ఫ్లైట్ షేమ్” ఉద్యమ స్ఫూర్తితో - “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ఉద్యమంలో భాగంగా ఈ “ఫ్లెక్సీషేమ్” (మానవ మనుగడకు ప్రమాదకరమైన ఫ్లెక్సీలను పెట్టేందుకు నేను చాలా సిగ్గు పడతాను)
ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది.
మనం చూస్తూనే ఉన్నాం గదా -
- రకరకాల పండుగలప్పుడు,
- రాజకీయ నాయకుల, ప్రముఖుల, సినీ నటుల పుట్టిన రోజుల సందర్భంగా,
- వివాహాది వేడుకలలోనూ,
- మరణాలను తెలుపుటకు,
- సినిమాల విడుదలప్పుడు,
- కొత్త వ్యాపార సంస్థల ప్రారంభ ప్రచారాలలోనూ,
- ప్రభుత్వ కార్యక్రమాలలోనూ
ఈ ఫ్లెక్సీలు వేయించడం జరుగుతోంది.
వీటికి బదులు పర్యావరణానికి హాని చేయని “గుడ్డ బ్యానర్లు” రాయించలేమా?
“ఫ్లెక్సీ బ్యానర్లను వేయించే ఈ ప్రమాదకర సంస్కృతికి దయ చేసి ఫుల్ స్టాప్ పెట్టి, గుడ్డ బ్యానర్లను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలోని మిగిలిన గ్రామాలకు మనం ఆదర్శంగా ఉందామని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.”
ఇట్లు
దాసరి రామకృష్ణ ప్రసాదు
(స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల తరపున)
18.09.2021.