ఈ రోజు పురిటిగడ్డలో మా పెద్దమ్మ గారైన శ్రీమతి పరుచూరి లీలావతి గారి పెదకర్మ కార్యక్రమం పర్యావరణహితంగా జరిగింది.
- ఫ్లెక్సీ పెట్టలేదు.
- బల్లలపై కాగితమే పరిచారు.
- భోజనానికి అరిటాకులను, మంచి నీళ్లకు స్టీలు గ్లాసులను వాడారు.
పర్యావరణహితంగా ఈ కార్యక్రమాన్ని జరిపిన లీలావతి గారి కుమారులు పరుచూరి కోటేశ్వరరావు, సురేష్ లు, కుమార్తె తొట్టెంపూడి లక్ష్మీ గార్లకు 'స్వచ్ఛ చల్లపల్లి' కుటుంబం తరపున అభినందనలు.
- దాసరి రామకృష్ణ ప్రసాదు
04.06.2020