03.04.2020 ....           03-Apr-2020

 మాత డా.పద్మావతి మదిన మెదిలిన సుందరీకరణ,
సత్వభావాన రహదారివనాల సుందర రూపమిచ్చె,
చిత్రోత్సవ మధనంబు తలపెట్టె విదుషీమణి,
ప్రతిభాపాటవాల మాధురీ, దుర్గావాసులతో
.సుందరబృంద చిత్రకళా వైభవం.
మాధురీపద్మావతుల, దుర్గావాసుల
కళాపాటవం,
అక్షర మాలికలు, పుష్పాలు ఫలములు,
పాండాలు,పెంగ్విన్లు, కార్టూను చిత్రాలు,
నాట్యాభంగిమలు, జలపాతాలు,
పూర్ణకలశాలు,
చిత్రకళా ప్రక్రియలేన్నెన్నో సమాహారం
చేసి కూర్చిన
సామ్యవాద బజారున 25 దినములు
మహాయజ్ఞం చేసి,
అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిరి.
పరిమళించిన చిత్రకళా వైభవం
భావితరానికి స్ఫూర్తి.

 

03.04.2020