ప్రాతూరి శాస్త్రి 25.08.2020. ....           25-Aug-2020

                       కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులు మన చల్లపల్లి కార్యకర్తలు

డిసెంబరు 4, 2016 స్వచ్ఛ సుందర చల్లపల్లి కి గొప్ప అనుభూతి నిచ్చినదినము. వెంకయ్య నాయుడు గారు వచ్చిన నాటినుండి పాత్రికేయులు, టీవీ చానల్స్ వారు చల్లపల్లికి వచ్చి కార్యకర్తల, గ్రామ ప్రజల ను అడిగి తెలిసికొనివారు.

ముఖ్యంగా ఈటీవీ వారు చాలా సార్లు చల్లపల్లి ని గురించి ప్రసారం చేశారు.

ఈటీవీ సుబ్బారావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసికొని మొదట రెండు సంవత్సరాల ప్రగతిని ఆదివారం అనుబంధంలో కవరు పేజీ తో సహా ప్రచురించారు.

 అదే డిసెంబర్ 4.2016.

ఆరోజు ఆనంద ఆదివారం.

కాగా. దేశంలో తెలుగు పేపరు చదివే వారందరికీ స్వచ్చ చల్లపల్లి గురించి తెలియజేసారు ఈటీవీ యాజమాన్యం.

ఈటీవీ యాజమాన్యానికి కార్యకర్తల తరఫున శతకోటి వందనాలు.

ప్రాతూరి శాస్త్రి

25.08.2020