ప్రాతూరి శాస్త్రి - 23.10.2020. ....           23-Oct-2020

 రాజమండ్రి లో బాపు ఉన్నత సేవా సమితి పురస్కారం – 27.10.2019

   ...... 

సచ్చోద్యమంలో కొన్ని ప్రత్యేక మైలురాళ్లుగా చెప్పుకోవాలి. నరకచతుర్దశి, దీపావళి కొంతభాగం కార్యకర్తల ప్రయాణంలోను, రాజమహేంద్రవర పురస్కార స్వీకారంతో జరగడమే ఆ ప్రత్యేకత!

ఉదయం 9.30 కు స్వచ్చ సుందర చల్లపల్లికి జయజయధ్వానాలతో 40 మందితో మొదలైన రాజమండ్రి బస్సు యాత్ర రెండు చోట్ల కొద్ది విరామాలాతో నార్నికేదారేశ్వర కళావేదికలో రాష్ట్ర శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం గారి నుండి డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు, పద్మావతి గారు కార్యకర్తల పక్షాన పురస్కారమందుకొన్నారు. తిరుగు ప్రయాణం రాత్రి భోజనానంతరం బయలుదేరి 3.00 AM. కు చల్లపల్లి చేరినాము.

 “రాకాసంస్థ సభ్యులు గాని, ఆహూతులైన పెద్దలు గాని, ప్రతి ఒక్కరు తమ ప్రసంగాలలో స్వచ్చోద్యమ చల్లపల్లిని పదేపదే ప్రస్తావించి, ప్రశంసించి, ఈ స్వచ్చ సైనికుల సుదీర్ఘ నిస్వార్ధ కృషిని ప్రత్యక్షంగా చూడాలని, మన గ్రామానికి రావాలని అన్నారు.

- ప్రాతూరి శాస్త్రి

23.10.2020.